in ,

‘విరూపాక్ష’ ఓటీటీలోకి వచ్చేస్తుందండోయ్…

‘విరూపాక్ష’ ఓటీటీలోకి వచ్చేస్తుందండోయ్…

భారీ విజయాన్ని అందుకున్న ‘విరూపాక్ష’ సినిమా అతి త్వరలో ఓటీటీలోకి రానుంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ ఇటీవలే అధికారికంగా ప్రకటించింది.

 

ఈ ఏడాది భారీ విజయాన్ని అందుకున్న సినిమాలలో సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ సినిమా ఒకటి. సుకుమార్ శిష్యుడు కార్తిక్ దండు తెరకెక్కించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకుల ఆదరణ పొందింది. ప్రమాదం తరువాత మళ్ళీ కొత్తగా ఎంట్రీ ఇస్తున్న సాయి ధరమ్ తేజ్ కు మంచి హిట్ ఇచ్చింది. నటనతో అలరించిన సంయుక్త మీనన్ కు మరింత గుర్తింపును తెచ్చింది. ఆలాంటి ‘విరూపాక్ష’ ఇప్పుడు ప్రేక్షకులను మరో సారి అలరించడానికి ఓటీటీ లో అడుగు పెట్టబోతోంది.

ఈ విషయాన్ని ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ‘మూడో కన్నుతో మాత్రమే చూడగలిగే ఒక నిజం రానుంది. మీరు చూసేందుకు సిద్ధంగా ఉండండి’ అని పోస్ట్ చేస్తూ మే 21న ఈ సినిమా ఓటీటీ లోకి రానున్నట్లు తెలిపింది.

What do you think?

తెదేపా మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి కారు బోల్తా..

అరుదైన ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన ఓ నైజీరియన్ మహిళ