ప్రజలలో ఓ.టీ.టీ ఆధరణ పెరగడం చూసిన సినీ తారలు,దర్శకులు ఆ పరిశ్రమలోకి కూడా ఒక్కొకరుగా అడుగు పెడుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే.అయితే ఇప్పుడు ఈ జాబితాలో డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా చేరిపోయారు.
విషయంలోకి వెళ్తే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్,నిర్మాత దిల్ రాజు చేతులు కలిపి తెరకెక్కించిన వెబ్ సీరీస్”ఏటీఎమ్”(ATM).ఒక ఏడాది ముందు అనౌన్స్ అయిన ఈ సీరీస్ ఒక అసక్తి కథతో థ్రిల్లర్ గా తెరకెక్కి ఇప్పుడు స్ట్రీమింగ్ కి సిద్ధమైంది.ఈ విషయాన్నే తెలియచేస్తూ జీ5 వాళ్ళు అధికారికంగా ప్రకటించారు.ఈ సందర్భంగా ఒక వీడియోని కూడా విడుదల చేశారు.
ఈ విడియో ఏటీఎంల దోపిడీ గురించి న్యూస్ పేపర్లలో వచ్చిన వార్తలను చూపిస్తూ సాగింది.విడియో చివర్లో టైటిల్ తో పాటు ఈ సీరీస్ జనవరి 20న విడుదల కాబోతోందని అనౌన్స్ చేశారు.
దర్శకుడు హరీష్ శంకర్ కథను అందించగా,చంద్రమోహన్ ఈ సిరీస్ కు దర్సకత్వం వహించారు.సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్ విహారీ స్వరాలు సమకూర్చగా,బిగ్బాస్ ఫేమ్ వీజే సన్నీ,సుబ్బరాజు, రోయెల్ శ్రీ, రవిరాజ్, కృష్ణ బురుగుల ఈ సిరీస్లో ప్రధాన పాత్రలు పోషించారు.
“ఏటీఎమ్”తో హరీష్ శంకర్ ఓ.టీ.టీ లోకి..
![](https://7pmnews.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-10-at-3.16.40-PM-758x426.jpeg)