in

రౌడీ బేబీ స్పెషల్ క్వాలిటీస్ కి అందరూ ఫిదానే

డి ఫోర్ తో బుల్లి తెరకు పరిచయమై రౌడీ బేబీ సాయి పల్లవి, 2003లో మలయాళం లోని కస్తూరి మాన్ సినిమాలో  మీరా జాస్మిన్ కి ఫ్రెండ్ గా చిన్న సన్నివేశంలో నటించారు. అలా సినిమా అరంగేట్రం చేసిన సాయి పల్లవి 2015 లో హీరోయిన్ గా మలయాళంలో ప్రేమమ్ లో నటించి, బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. 2017 లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమా తో తెలుగులోకి అరంగేట్రం చేసింది. యమ్ సి ఎ,  లవ్ స్టోరీ,  శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం, గార్గి మెుదలగు చిత్రాలలో నటించారు.

ఈమె గురించి చెప్పాలంటే తమిళనాడులో కోటగిరి ప్రాంతవాసులు అయిన సెంతమరై కన్నన్, రాథా కన్నన్ దంపతులకు జన్మించింది. ఈమెకు పూజా కన్నన్ అనే ఒక చెల్లెలు ఉంది. ఈమె జార్జ్ లో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఈమెకు చాలా ఇష్టం.

విభిన్న కథలతో కూడిన పాత్రను ఎంచుకుని తన నటనతో అందరినీ మెప్పిస్తోంది. సినిమాలో క్యారెక్టర్ ల విషయమే కాకుండా తన క్యారెక్టర్ విషయంలో కూడా ఏమాత్రం రాజీ పడదు. తనకు కంఫర్ట్ లేకపోతే నటనకు అంగీకరించదు. తను చేసే పాత్రకు న్యాయం చేయాలని తపిస్తుంది. నటనా కౌసల్యమే కాదు మంచి ఉన్నత విలువలు ఉన్న మనిషి. సౌందర్యసాధనాల విషయంలో అబద్ధాలు చెప్పను అంటూ రెండు కోట్లు ఆఫర్ ను కూడా తిరస్కరించింది.

ఈమెకు ఫేవరెట్ హీరోస్ కమల్ హాసన్, సూర్య గారు అలాగే ఫేవరేట్ హీరోయిన్స్ జ్యోతిక, సిమ్రాన్ గారు డాన్సింగ్ అండ్ ట్రావెలింగ్ ఈమె హాబీస్.

ఈమె నటించిన ప్రేమమ్ సినిమాకు 2016 లో జ్యూరీ అవార్డు లభించింది. 2018 లో బెస్ట్ యాక్టర్ గా ఫిదా సినిమాకి అవార్డు వచ్చింది. సాయి పల్లవి తన నటనా కౌశల్యంతో మరిన్ని అవార్డులు గెలుచుకోవాలని ఆశిద్దాం.

What do you think?

103 Points
Upvote Downvote

పీక్స్ లో ఫ్యాన్ వార్స్ – మితిమీరిన అభిమానం

అత్యుత్తమ సాంకేతికతతో ప్రభాస్-నాగ్ అశ్విన్ ప్రోజెక్ట్ కే ..!