in

మరో సారి మరో కొత్త కథతో రాబోతున్న అడవి శేష్ . గూఢచారి సీక్వెల్ చిత్రీకరణ ప్రారంభం.

తన విలక్షణమైన నటనతో,అబ్బురపరిచే సినిమాలతో ఎప్పటికప్పుడు మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించే హీరో అడవి శేష్.
అలాంటి అడవి శేష్ గత ఏడాది “మేజర్”,”హిట్ 2” సినిమాలతో వరుస విజయాలందుకొని తన సత్తా చాటాడు.ఇప్పుడు మరో ఆసక్తి కర కొత్త సినిమా “జి2″లో నటించబోతున్నాడు.
వివరాల్లోకి వెళ్తే అడవి శేష్ కి మంచి విజయాన్ని అందించిన “గూఢచారి” సినిమాకి సీక్వెల్గా తెరకెక్కుతున్న సినిమా ఈ “జి2”.ఎప్పటిలాగే శేష్ ఈ సినిమాకు కథను అందిస్తుండగా.. వినయ్ కుమార్ సిరిగినీడి తెరకెక్కిస్తున్నారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కాశ్మీర్ ఫైల్స్,కార్తికేయ 2 సినిమాలను నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్,ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ జి2 సినిమాను నిర్మిస్తున్నాయి.ఈ సినిమా ఫస్ట్లుక్ ని,ప్రచార చిత్రాన్ని,టైటిల్ ని ఇటీవల చిత్ర బృందం విడుదల చేసింది.ఆ ప్రచార చిత్రంలో శేష్ ఓ బిల్డింగ్ పై నుంచి దూకుతూ తుపాకీ కాల్చడం ఆసక్తిని కలిగిస్తుంది. మొదటి గూఢచారి సినిమా కథ ఇండియాలో సాగగా.. “జి2” అంతర్జాతీయ నేపథ్యంలో సాగనుంది.ఈ సినిమా
రెగ్యులర్ చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది.ఇక “మేజర్”,”హిట్ 2” సినిమాలతో అడవి శేష్ క్రేజ్ పెరగడంతో ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయబోతున్నారు.

What do you think?

103 Points
Upvote Downvote

ఐపీఎల్ కి దూరమైన రిషబ్ కి బీసీసీఐ శుభవార్త.రూ.16 కోట్ల వేతనాన్ని ఇవ్వనున్నట్లు బోర్డ్ ప్రకటన.

నష్టపరిహారంగా 10 వేల కోట్లు కావాలంటూ డిమాండ్ చేస్తున్న మాజీ ఖైదీ ట్రైబల్ కాంతిలాల్.