in

అదరగొడుతున్న భారత్ షూటర్లు…

భారత్:

అన్ని క్రీడలలోనూ భారతదేశం తన ఉనికిని చాటుతుందని మన ఆటగాళ్లు మరోసారి నిరూపించారు. ఎక్కడైనా సరే మనకంటూ ఒక ప్రత్యేక స్థానం సృష్టించుకునే సత్తా మనకుందని చాటిచెప్పారు.

ఇటీవలే ఆసియా ఎయిర్గన్ షూటింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న భారతీయులు తమ ప్రతిభతో అందర్నీ ఆశ్చర్య పరిచారు. జూనియర్ మహిళల 10 ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో హైదరాబాద్ అమ్మాయి ఇషా సింగ్ భారత్కి చెందిన మరో అమ్మాయి మనూ భాకార్ చేతిలో ఓడిపోయి రజతం గెలుచుకుంది. సీనియర్ మహిళా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో రిథమ్ సాంగ్వాన్ 16-8 తో భారత్కే చెందిన పలక్ మీద విజయం సాధించి పసిడి పతాకం సొంతం చేసుకుంది.

జూనియర్ పురుషుల 10 మీటర్ల ఫైనల్లో సాగర్,సామ్రాట్ రాణా మరియు వరుణ్ తోమర్లతో కూడిన భారత్ జట్టు జుబెకిస్తాన్ జట్టును ఓడించి స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. సీనియర్ పురుషుల 10 మీటర్ల ఫైనల్లో శివ సర్వాల్,నవీన్ మరియు విజయ్ వీర్ల జట్టు 16-14తో కొరియా జట్టును ఓడించి బంగారు పతకం సొంతం చేసుకుంది. ఈ విధంగా ఎవరికి వారు తమ ప్రతిభ చూపి భారత్ గౌరవాన్ని పెంచారు.

What do you think?

22 Points
Upvote Downvote

2023లో మహిళా ఐ.పి.ఎల్ ప్రారంభంకాబోతుందా…

Ruturaj

ఒక్క ఓవర్లో 7 సిక్సర్లా, ఇదెక్కడి మాస్ రా మామా…!