కరోనా మహమ్మారి మళ్ళీ వచ్చేసింది. భారత్ లో కరోనా విజృంభణ మళ్ళీ మొదలైంది. కోవిడ్ కేసులు రోజు రోజుకు గణనీయంగా పెరిగిపోతున్నాయి.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 841 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. రోజువారీ కేసుల సంఖ్య 800 దాటడం నాలుగు నెలల తర్వాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ వంటి పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది.
దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు.