లోకేశ్ పై గుర్తు తెలియని వ్యక్తుల కోడిగుడ్ల దాడి!
ఏపీ మాజీ మంత్రి నారా లోకేశ్ పై గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడి చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రొద్దుటూరులో ఈ ఘటన చోట చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే ప్రొద్దుటూరులో ఏపీ మాజీ మంత్రి నారా లోకేశ్ బహిరంగ సభ అనంతరం మైదుకూరు రోడ్డుమార్గంలో యువగళం పాదయాత్ర సాగించారు. ఈ క్రమంలో లోకేశ్ పై ఓ వ్యక్తి కోడిగుడ్డు విసిరాడు. అయితే ఆ కోడిగుడ్డు అక్కడి భద్రతా సిబ్బందికి తగిలింది. దీంతో టీడీపీ కార్యకర్తలు కోడిగుడ్డు విసిరిన ఆ వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.
కాగా.. ఈ ఘటన అనంతరం లోకేశ్ అక్కడే కూర్చుని దీనిపై నిరసనకు దిగారు.
#WATCH | Andhra Pradesh | TDP (Telugu Desam Party) leaders allege attack from people of YSRCP during Yuvagalam padayatra in Proddutur. The padayatra is being carried out by TDP leader and party chief N Chandrababu Naidu's son Nara Lokesh.
(01.06.2023) pic.twitter.com/XKFIK56scX
— ANI (@ANI) June 2, 2023