గ్రామస్తుల పేరు మీద రూ.20 కోట్ల రుణాలు తీసుకున్నాడు
చాటపర్రులో ఓ వ్యక్తి గ్రామస్తుల పేరు మీద బ్యాంకు నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నాడు. బకాయిలు తీర్చాలని గ్రామస్తులకు నోటీసులు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే ఏలూరు జిల్లా చాటపర్రులో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి గ్రామస్తుల పేరు మీద వారి ఆస్తి పత్రాలు కెనరా బ్యాంకులో తనఖా పెట్టి రూ.20 కోట్ల రుణాలు తీసుకున్నాడు. ఈ పనిలో అతనికి అధికారులు కూడా సహఖరించారు.
అయితే కొన్ని నెలలకి బ్యాంక్ నుండి బకాయిలు తీర్చాలని గ్రామస్తులకు నోటీసులు రావడంతో ఈ విషయం బయటపడింది. బ్యాంకు నోటీసులు చూసిన గ్రామస్తులు విషయం ఏంటో తెలియక ఆందోళన చెందుతున్నారు. కాగా దీనికి సంభందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.